పెద్దఎత్తున బాబాను దర్శించుకున్న భక్తులు
వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ షిరిడీ సాయిబాబా ఆలయం గురువారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. వీరవాసరం, భీమవరం, పెనుమంట్ర, పాలకొల్లు తదితర ప్రాంతాల నుంచి బాబా దర్శనానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఆలయ అర్చకులు సాయిబాబాకు విశేషంగా పూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు