కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిపై ఏపీసీసీ ఛీప్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. కడపకు అవినాష్రెడ్డి ఏం చేశారని ప్రశ్నించారు. రాజోలి ప్రాజెక్టు, కడప స్టీల్ ప్లాంట్ గురించి ఏనాడైనా పోరాడారా? అని నిలదీశారు. న్యాయం వైపు ఉంటారో.. అన్యాయానికి ఓటేస్తారో ప్రజలే తేల్చుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆమె ఈ మేరకు మాట్లాడారు.