రాజకీయాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం నెల్లూరు జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయాలు రోజురోజుకీ దారుణంగా మారుతున్నాయన్నారు. ఏ రాజకీయ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియడం లేదన్నారు. ఎవరైనా తమ తమ వంశాల నుంచి ఎవరో ఒకరిని రాజకీయాల్లో ఉండాలని కోరుకుంటారని అన్నారు.