టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఆఖరి ఓవర్లో దక్షిణాఫ్రికా విజయానికి 16 పరుగులు చేయాల్సి ఉండగా పాండ్యా వేసిన మొదటి బంతిని డేవిడ్ మిల్లర్ గాల్లోకి కొట్టాడు. దాన్ని బౌండరీ లైన్లో సూర్యకుమార్ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. అంతా అది సిక్స్ అనుకున్నారు. కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ, భారత్కు గెలుపునందిస్తూ సూర్య ఆ క్యాచ్ పట్టుకున్నాడు. ఈ క్యాచ్తో మ్యాచ్ స్వరూపం మారిపోయి.. భారత్ గెలుపొందింది.