సొంత చెల్లికే ఆస్తి ఇవ్వని జగన్ మనకేం చేస్తారని జనసేన అధినేత పవన్ అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ’’డబ్బులతో ఓట్లు కొనని రాజకీయం ఉన్నప్పుడే నిజమైన అభివృద్ధి ఉంటుంది. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం ఎందుకు? అభివృద్ధి పనులు చేసేందుకు బటన్లు నొక్కాలి. గత ఎన్నికల్లో ఓడిపోయాక మరింత బలపడ్డాం. తీవ్ర అప్పుల్లో కూరుకుపోయిన ఏపీని రక్షించాలి’’ అని పవన్ అన్నారు.