జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోవడం ఖాయమని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. మంగళవారం ముద్రగడ మాట్లాడుతూ.. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ను ఓడించి పంపకపోతే తన పేరు మార్చుకుంటానని సవాల్ విసిరారు. తన పేరు పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని ప్రకటించారు.