మెగా డీఎస్సీ పేరుతో
వైసీపీ సర్కార్ యువతను మోసం చేస్తోందని
జనసేన నేత నాగబాబు ఆరోపించారు. మంగళగిరిలోని
జనసేన కార్యాలయంలో డీఎస్సీ అభ్యర్థులతో ఆయన మాట్లాడారు. "23 వేల పోస్టులతో డీఎస్సీ ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో నిరుద్యోగులు వైసీపీకి ఓట్లు వేసి గెలిపించారు. కానీ ఇచ్చిన హామీని నెరవేర్చలేకపోయారు.
జనసేన-
టీడీపీ ప్రభుత్వంలో వీరికి తప్పకుండా న్యాయం చేస్తాం." అని నాగబాబు హామీ ఇచ్చారు.