కాంగ్రెస్‌లోకి వైసీపీ.. క్లారిటీ

78చూసినవారు
కాంగ్రెస్‌లోకి వైసీపీ.. క్లారిటీ
తాను టీడీపీలోకి వెళ్లడం లేదని వైసీపీ నాయకురాలు బుట్టా రేణుక క్లారిటీ ఇచ్చారు. వైసీపీని వీడుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఆమె తెలిపారు. వైసీపీ అధినేత జగన్‌పై తమకు నమ్మకం ఉందని, ఆయన వెంటనే నడుస్తామన్నారు. వైసీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారనే వార్తలో కూడా నిజం లేదన్నారు. కాంగ్రెస్‌కు అసలు ఓటింగే లేదని, అలాంటి పార్టీతో వైసీపీ ఎలా చేతులు కలుపుతుందని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్