AP: సచివాలయ ఫర్నిచర్ మాజీ సీఎం జగన్ ఇంట్లో ఉందని ఆరోపిస్తూ టీడీపీ ట్వీట్ చేసింది. "లక్షల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టినా.. జగన్కి ప్రజల సొమ్ము మీద మోజు తీరలేదు. అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి క్యాంపు కార్యాలయాన్ని సచివాలయ ఫర్నిచర్తో నింపేసాడు. పదవి ఊడిపోయాక ఆ ఫర్నిచర్ తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయాలి కదా! అయినా ఇవ్వలేదు. ఫర్నిచర్ దొంగ జగన్." అని పేర్కొంటూ ఒక ఫొటోను షేర్ చేసింది.