ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ఆయన వదినమ్మ సురేఖ ఓ ప్రత్యేక బహుమతిని అందజేశారు. ఏపీ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్కు చిరంజీవి, సురేఖలు డిస్నీ మోంట్ బ్లాంక్ పెన్ను, పుస్తకాన్ని బహుమతిగా అందించారు. ఈ విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి వీడియో తీసి తన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ బహుమతి ఖరీదు రూ. 2.53 లక్షలు. ఇకపై పవన్ ఆ కలంతోనే సంతకం చేయనున్నారు.