ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈనెల 25వ తేదీన నామినేషన్ దాఖలు చేస్తారని వైసీపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నియోజకవర్గాలలో ప్రచారం జరుగుతున్న తీరు, పార్టీ శ్రేణులు ఎలా పనిచేస్తున్నాయనే అంశాలపై సమీక్షలు చేస్తున్నాం. సమీక్షలలో పార్టీ పరిస్దితి చాలా బాగుంది. పార్టీ కార్యకర్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేలో జరిగే ఎన్నికలలో వైసీపీ విజయం ఖాయం అని సజ్జల తెలియచేశారు.