జిపిఎస్ అమలుపై రాజపత్రాన్ని ఉపసంహరించుకోవాలి: యుటిఎఫ్

60చూసినవారు
సిపిఎస్ ఉద్యోగులకు జిపిఎస్ విధానాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రాజ పత్రాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదన విజయకుమార్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం బద్వేలు లోని స్థానిక ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రభుత్వం జారీచేసిన రాజపత్రాలను దగ్ధం చేస్తూ వినూత్నంగా నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఎస్. ఓబుల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్