కడప జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

52చూసినవారు
కడప జిల్లాలో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
కడప జిల్లాలో వర్షాలు కురవక కరువుతో, అధిక ఎండలతో పంటలు ఎండిపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతు సేవా సమితి జిల్లా అధ్యక్షుడు ఏవి. రమణ కోరారు. గురువారం మైదుకూరు మండలం జివి. సత్రం గ్రామ పరిధిలో మినుము, టమోటా పంటలు నష్టపోయిన పంటలను పరిశీలించారు. పంట నష్టంతో రైతులకు ఎకరాకు రూ. 20 వేలు నష్టం వాటిలిందన్నారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్