పెట్రో ధరలపై సీపీఐ నిరసనలు

5063చూసినవారు
పెట్రో ధరలపై సీపీఐ నిరసనలు
కోదాడ : కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రో, డిజిల్‌ ధరలను వెంకటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కోదాడలో సీపీఐ మండల కమిటి ఆధ్వర్యంలో మంగళవారం కోదాడలో బిజెపి దిష్టిబొమ్మను దగ్దం చేశారు. స్థానిక బస్టాండ్‌ సెంటర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు మేకల శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చి హామీలను తుంగలో తోక్కి పేద ప్రజలపైన అదనపు భారం మోపుతూ వారి నడ్డి విరుస్తున్నదన్నారు. ప్రతి రోజు డిజిల్‌, పెట్రో ధరలను విపరీతంగా పెరిగిపోతున్నాయని, వాటిని నియంత్రించడంలో ప్రభుత్వాలు ఏమి పట్టనట్లుగా వ్వవహరిస్తున్నాయన్నారు. తక్షణమే పెట్రో పెరుగుదలపై నియంత్రణ విధించాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు బొల్లప్రసాద్‌, ఎస్‌కె లతీఫ్‌,కోటనారాయణ, వేణు, పాషా, రహిమాన్‌, విజయ్‌, రవి, శ్రీనివాసరెడ్డి, రాజీ, నాగుల్‌మీరా, షరీఫ్‌ , గురవయ్య తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :