బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్పై దాడి జరిగినట్టు ఓ వీడియోను పోస్ట్ చేసిన వ్యక్తిపై రవీనా రూ.100 కోట్లు పరువు నష్టం దావా వేస్తూ నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. దీనిపై రవీనా న్యాయవాది సనా ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇలాంటి ఫేక్ న్యూస్ను ప్రచారం చేసి ఉద్దేశపూర్యకంగానే రవీనా ఇమేజ్కు భంగం కలిగిస్తున్నారు. ఆమె పేరును ఉపయోగించుకుని కొందరూ పబ్లిసిటీతో లాభాలు పొందాలని చూస్తున్నారు. ఈ విషయంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం’ అంటూ చెప్పుకొచ్చారు.