బిహార్ సీఎంపై ప్రశాంత్‌ కిషోర్‌ ఆగ్రహం

57చూసినవారు
బిహార్ సీఎంపై ప్రశాంత్‌ కిషోర్‌ ఆగ్రహం
బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌‌పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘గతంలో ఆయనతో కలిసి పనిచేసిన నేను ఎందుకు విమర్శిస్తున్నానని ప్రజలు నన్ను అడుగుతున్నారు. అప్పుడు సీఎం వేరే వ్యక్తి. కానీ ఇప్పుడు మనస్సాక్షిని బీజేపీకి అమ్మకానికి పెట్టారు. ఒక రాష్ట్రానికి నాయకుడిగా ఉండేవాడు అక్కడి ప్రజలు గర్వపడేలా నడుచుకోవాలి. కానీ నితీశ్‌ కుమార్ బిహార్‌కు అవమానాన్ని మిగిల్చారు’’ అని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్