యూపీలో 121మంది మృతికి కారణమైన బోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ నేర చరిత్రను కలిగి ఉన్నాడు. అతనిపై లైంగిక వేధింపులతో పాటు పలు కేసులు నమోదైనట్లు పోలీసులు బుధవారం ప్రకటించారు. అక్కడ మంగళవారం సత్సంగ్ పేరిట నిర్వహించిన మతపరమైన కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాటలో 121 మంది మరణించగా, వందలాది మందికి గాయాలైన సంగతి తెలిసిందే. ఆగ్రా, ఇటావా, కస్గంజ్, ఫరూఖాబాద్ మరియు రాజస్థాన్లో సూరజ్పాల్పై పలు కేసులు నమోదయ్యాయి.