13.32 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం: తుమ్మల

70చూసినవారు
13.32 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలు సిద్ధం: తుమ్మల
తెలంగాణలో ప్రస్తుతం 13,32,827 క్వింటాళ్ల సన్నరకం వరి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గతేడాది కంటే ఈసారి 15.75 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అధికంగా పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. వర్షాల కారణంగా డిమాండ్ అధికంగా ఉన్నప్పటికీ పచ్చిరొట్ట విత్తనాలను సైతం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జీలుగ, జనుము, పిల్లి పెసర విత్తనాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

సంబంధిత పోస్ట్