17 మందికి ఒకేసారి పెళ్లి.. ఒకే శుభలేఖ

55చూసినవారు
17 మందికి ఒకేసారి పెళ్లి.. ఒకే శుభలేఖ
రాజస్థాన్‌లోని నోఖా మండలం లాల్‌మదేసర్ గ్రామానికి చెందిన సుర్జారామ్ కు 17 మంది మనవళ్లు. వీరందరికీ విడివిడిగా పెళ్లి చేయడం ఖరీదవుతుందని భావించి కేవలం రెండు రోజుల్లో వారందరికీ పెళ్లి చేశారు. వింతగా అనిపించినా ఇదే జరిగింది. వీరందరికి భాగస్వాములను వెతకడం కూడా కష్టమే. అయితే వీరందరికీ ఒకే శుభలేఖను ముద్రించడం మరో విశేషం. ఒకే ఇంట్లో, ఒకే వెడ్డింగ్‌ కార్డ్‌తో జరిగిన ఈ సామూహిక వివాహ తంతుకు అందరూ ఆశ్చర్యపోయారు.

సంబంధిత పోస్ట్