ఆప్ ఎమ్మెల్యేకు కోర్టు సమన్లు

59చూసినవారు
ఆప్ ఎమ్మెల్యేకు కోర్టు సమన్లు
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం సమన్లు పంపింది. ఢిల్లీ వక్ఫ్ బోర్డు మనీలాండరింగ్ కేసులో ఆయనకు పలుమార్లు కోర్టు నోటీసులు జారీ చేసినా స్పందించలేదు. దీంతో ఏప్రిల్ 20న విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్యేను కోర్టు ఆదేశించింది. సెక్షన్ 174 IPC, 1860 కింద ED దాఖలు చేసిన ఫిర్యాదుపై విచారణ తర్వాత కోర్టు ఈ ఉత్తర్వులు వెలువరించింది.

సంబంధిత పోస్ట్