ఏపీ ప్రభుత్వం స్కూళ్లకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఒంటిపూట బడులలో రోజూ కచ్చితంగా మూడు సార్లు వాటర్ బెల్ కొట్టాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా వేసవి సెలవులు ముగిశాక పాఠశాలల పున:ప్రారంభం తర్వాత కూడా ఈ విధానాన్ని అమలు చేయనుంది. విద్యార్థుల్లో డీహైడ్రేషన్ ముప్పును తప్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో రోజూ ఉదయం 8:45, 10:05, 11:50 గంటలకు వాటర్ బెల్ కొడుతున్నారు. ఇకపై ఈ విధానం రోజు అమలు కానుంది.