తమిళనాడు లోక్సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ విడివిడిగా పోటీ చేసి ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి స్పందించారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో తమ పార్టీ పొత్తు పెట్టుకోదని ప్రకటించారు.