సార్టెక్స్‌ పేరిట ఏడాదికి రూ.240 కోట్లు ఖర్చు

68చూసినవారు
సార్టెక్స్‌ పేరిట ఏడాదికి రూ.240 కోట్లు ఖర్చు
వైసీపీ ప్రభుత్వంలో సన్నబియ్యం ఇస్తామని హామీ ఇచ్చి తర్వాత సార్టెక్స్‌ (నూకలు తక్కువగా ఉన్న బియ్యం) పంపిణీ అని మాట మార్చేశారు. దానికి ప్రభుత్వం నెలకు రూ.20 కోట్లు ఖర్చు చేసింది. అంటే ఏడాదికి రూ.240 కోట్లు ఖర్చు పెట్టారు. అయినా పేదలకు తినగలిగే బియ్యం అందలేదు. ఈ బియ్యానికే కిలోకు రూ.41 పైగా వరకు ఖర్చవుతోందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. రేషన్‌ వాహనాల్లో పంచదార, బియ్యం తప్పితే మరేమీ ఇవ్వలేదు.

సంబంధిత పోస్ట్