కువైట్ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారాన్ని ఇవ్వాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కువైట్ అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన ముగ్గురు కార్మికులు మృత్యువాత పడ్డారు. కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు మరణించిన విషయం తెలిసిందే.