ప్రస్తుత దశాబ్దం చివరి నాటికి భారతదేశ ఉక్కు ఉత్పత్తి 300 మిలియన్ టన్నుల మార్కును దాటుతుందని ఉక్కు కార్యదర్శి నాగేంద్రనాథ్ సిన్హా అంచనా వేశారు ‘ప్రభుత్వం మౌలిక వసతుల విషయంలో నిశ్చయంతో ఉంది. అందువల్ల, స్టీల్ డిమాండ్ బాగా ఉంటుందని మేము భావిస్తున్నాము. జీడీపీ కూడా నిలకడగా ఉన్నందున ఉక్కు ఉత్పాదకత బాగానే ఉండవచ్చు' అని ఆయన అన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో భారత్ 49.5 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేసింది.