33 మంది మృతి.. స్పందించిన హీరో

55చూసినవారు
33 మంది మృతి.. స్పందించిన హీరో
తమిళనాడులోని కళ్లకురిచ్చిలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 33 మంది చనిపోయారు. దీనిపై సినీహీరో దళపతి విజయ్ స్పందించారు. 'ఈ ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా తమిళనాడు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి' అని ట్వీట్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్