హజ్ యాత్రలో 68 మంది భారతీయులు మృతి

54చూసినవారు
హజ్ యాత్రలో 68 మంది భారతీయులు మృతి
ఈ ఏడాది హజ్ యాత్రలో 68 మంది భారతీయులు మరణించినట్లు సౌదీ అరేబియాలోని ఓ దౌత్యవేత్త బుధవారం వెల్లడించారు. తీవ్రమైన ఎండల కారణంగా మొత్తం 600లకు పైగా వివిధ దేశాల ప్రజలు హజ్ యాత్రలో చనిపోయారన్నారు. వారిలో ఎక్కువ మంది వృద్ధులు ఉన్నట్లు తెలిపారు. ఇందులో ఎక్కువ సంఖ్యలో ఈజిప్ట్‌కు చెందిన 323 మంది ఉన్నారన్నారు. మీడియా నివేదికల ప్రకారం ఈ ఏడాది మొత్తం 645 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్