36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: పొంగులేటి

64చూసినవారు
36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం: పొంగులేటి
తెలంగాణలో యాసంగి సీజన్ లో 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. సేకరించిన ధాన్యానికి గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం మూడు రోజుల్లోనే రైతులకు డబ్బులు చెల్లించామని పేర్కొన్నారు. గత పది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలిచ్చామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్