ఆప్ ఎంపీ స్వాతి మాలీవాల్పై దాడి కేసులో కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఢిల్లీలోని ఎయిమ్స్లో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఇచ్చిన నివేదిక ప్రకారం స్వాతి మాలీవాల్కు ఎడమ కాలు, కుడి చెంపపై గాయాలు ఉన్నాయని వెల్లడైంది. ఆ తర్వాత దాదాపు 3 గంటలు వైద్యపరీక్షలు నిర్వహించగా ముఖంపై గాయాలతో పాటు శరీరం లోపల కూడా గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు.