వరి పంటను కోసిన తర్వాత వరి కోయ్యలను రైతులు కాలబెడుతున్నారు. దీంతో అధిక నష్టాలు వచ్చే అవకాశముందని, వరి కొయ్యలను తగులబెట్టొద్దని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. వరి కొయ్యలను కాలిస్తే పర్యావరణ కాలుష్యం ఏర్పడడంతోపాటు పంటలకు మేలు చేసే సూక్ష్మజీవులు నశిస్తాయని అంటున్నారు. సారవంతమైన భూమి దెబ్బతింటుంది. రైతులు చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే వరి కొయ్యల మిగులు అవశేషాలతో సిరులు సంపాదించవచ్చని చెబుతున్నారు.