ఏపీలో వచ్చే లోక్సభ ఎన్నికల్లో మరోసారి వైసీపీ గెలుపు ఖాయమని రాజకీయ విశ్లేషకులు, జాతీయ స్థాయి సర్వే సంస్థలు చెబుతున్నాయి. ఇప్పటికే జాతీయ స్థాయిలో పలు సర్వేలు ఇదే విషయాన్ని చెప్పాయి. తాజాగా టైమ్స్ నౌ సర్వే కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. రానున్న లోక్సభ ఎన్నికల్లో మొత్తం 25 స్థానాలకు.. 20 స్థానాలను గెలుస్తుందని, టీడీపీ కూటమికి 4 నుంచి 5 స్థానాలు వస్తాయని తెలిపింది.