పాకిస్తాన్లో బుధవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై భూకంపం తీవ్రత 5.5గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ వెల్లడించింది. ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బుధవారం మధ్యాహ్నం 2.57 గంటల సమయంలో పాకిస్తాన్లో భూప్రకంపనలు సంభవించాయి. ఈ భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.