డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్కు శుక్రవారం 50 రోజుల పెరోల్ మంజూరైంది. ఇద్దరు మహిళలపై అత్యాచారం కేసులో ఆయన ప్రస్తుతం హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని సునారియా జైలులో ఉన్నాడు. హర్యానాలోని పంచకులలో సీబీఐ ప్రత్యేక కోర్టు 2017 ఆగస్టులో ఆయనను దోషిగా నిర్ధారించింది. దోషిగా తేలిన డేరాబాబాకు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఇక గత నాలుగేళ్లలో ఆయన 9 సార్లు జైలు నుంచి పెరోల్పై బయటికి వచ్చాడు.