అరవై శాతం మంది పిల్లలు డిజిటల్ వ్యసనం బారిన పడే ప్రమాదం ఉందని తాజా సర్వే ఒకటి పేర్కొంది. ఇందులో 5 నుంచి 16ఏళ్ల మధ్యనున్న వారే ఉన్నారని తెలిపింది. ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సూచించింది. స్మార్ట్ పేరేంట్ సొల్యూషన్ కంపెనీ అయిన ‘బాటు టెక్’ వెయ్యి మంది తల్లిదండ్రులను సర్వే చేసి ఈ వివరాలు వెల్లడించింది.