ఛత్తీస్గఢ్లోని బిలాస్పూర్ జిల్లాలో సోమవారం దారుణ ఘటన జరిగింది. 5 ఏళ్ల బాలికపై స్థానిక మైనర్ బాలురిద్దరూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక తల్లిదండ్రులు పని నిమిత్తం బయటకు వెళ్లారు. ఆ సమయంలో అదే ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలురు చిన్నారికి చాక్లెట్తో ఎర వేసి అత్యాచారం చేసి బాలికను వదిలి పారిపోయారు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు దర్యాప్తు చేపట్టి ఇద్దరు మైనర్ బాలురను అరెస్ట్ చేశారు.