AIలో భారత్ అగ్రగామిగా నిలుస్తుంది: మోడీ

63చూసినవారు
AIలో భారత్ అగ్రగామిగా నిలుస్తుంది: మోడీ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విషయంలో భారత్ అగ్రగామిగా అవతరిస్తుందని తాను నమ్ముతున్నట్లు ప్రధాని మోడీ అన్నారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బుధవారం నిర్వహించిన స్టార్టప్ మహాకుంభ్‌లో ఆయన ప్రసంగించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చోదక శక్తిగా ఎదుగుతున్న యువ ఆవిష్కర్తలు AI విభాగంలో నైపుణ్యం సాధించాలన్నారు. ప్రపంచానికి మంచి భవిష్యత్తును సృష్టించే మార్గాలను కనుగొనాలని స్టార్టప్ వ్యవస్థాపకులను కోరారు.

సంబంధిత పోస్ట్