యూపీలోని మొరదాబాద్లో దారుణం చోటు చేసుకుంది. ఆయుష్ యాదవ్ అనే బాలుడు స్విమ్మింగ్ పూల్కు వచ్చి రూ.10 ఇవ్వలేదన్న కారణంతో పూల్ యజమాని తండ్రీ కొడుకులు బాలుడి గొంతు కోసి దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత.. బాలుడి నోరు, ముక్కులో ఇసుక నింపారు. ఈ ఘటనపై సమాచారం అందుకుని పోలీసులు FIR నమోదు చేసి నిందితుడైన కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు.