బీజేపీ కేరళ రాష్ట్ర శాఖకు ఒక క్రైస్తవుడిని పార్టీ అధ్యక్షుడిగా నియమించే అవకాశం ఉంది. కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియను పార్టీ ప్రారంభించింది. కేంద్ర ఎన్నికల అధికారి ప్రహ్లాద్ జోషి ఆదివారం ఈ పదవికి నామినేషన్లు స్వీకరిస్తారు. పదవి రేసులో మాజీ పోలీసు చీఫ్ జాకబ్ థామస్ పేరు వినిపిస్తోంది. రాష్ట్రంలోని క్రైస్తవులను ఆకర్షించేందుకు ఆయన వైపు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.