కాంగ్రెస్ నేతను కాల్చి చంపారు

61చూసినవారు
కాంగ్రెస్ నేతను కాల్చి చంపారు
హర్యానాలోని ఫరీదాబాద్‌లో ఆదివారం రాత్రి కాంగ్రెస్ నేత కునాల్ భదానా (32) హత్యకు గురయ్యాడు. ఆయనను నిందితులు తుపాకీతో కాల్చి, కారులో పరారయ్యారు. ఈ ఘటనపై కునాల్ అన్న జ్యోతీంద్ర భదానా పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయ్ గుర్జార్ అనే వ్యక్తితో డబ్బు లావాదేవీలపై కునాల్‌కు వివాదాలున్నాయని పోలీసులు తెలిపారు. ఆ శతృత్వం కారణంగా కునాల్‌ను విజయ్ చంపినట్లు ఆధారాలున్నాయని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్