అధిక ధరలతో అల్లాడిపోతున్న పాక్ ప్రజలపై అక్కడి షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మరో భారాన్ని మోపింది. మరోమారు పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. పెట్రోల్ ధర లీటరుకు రూ.7.45 చొప్పున పెరిగింది. దీంతో ప్రస్తుతం లీటరు పెట్రోల్ ధర రూ.258.16 నుంచి రూ.265.61కి చేరింది. ఇక లీటర్ డీజిల్పై రూ.9.60 పెరిగింది. దీంతో లీటరు డీజిల్ ధర రూ.267.89 నుంచి రూ.277.49కి చేరింది.