పశ్చిమ బెంగాల్లో ఓ జంటపై జరిగిన దాడిపై బీజేపి అధ్యక్షుడు, కేంద్రమంత్రి జేపీ నడ్డా ఇవాళ స్పందించారు. రాష్ట్రంలో బహిరంగంగా దాడులు జరుగుతుంటే దీదీ ప్రభుత్వం ఏం చేస్తుందని ఎక్స్ వేదికగా నడ్డా ప్రశ్నించారు. మతం పేరుతో చేస్తున్న క్రూరత్వానికి ఇది నిదర్శనం అంటూ ఆయన మండిపడ్డారు. ఆ రాష్ట్రం మహిళలకు సురక్షితం కాదు అని ఆయన పేర్కొన్నారు. కాగా, దాడి చేసిన వ్యక్తి టీఎంసీ నేత తాజ్ముల్గా పోలీసులు గుర్తించి అరెస్టు చేశారు.