భారత కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులోకి రీఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే అతడు ప్లేయర్గా కాక ఈసారి బ్యాటింగ్ కోచ్, మెంటార్గా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు డీకేకు ఆర్సీబీ కీలక బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఐపీఎల్ సీజన్ (2025) నుంచి బెంగళూరుకు బ్యాటింగ్ కోచ్, మెంటార్గా వ్యవహరించనున్నాడని ఆర్సీబీ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది.