పారా అథ్లెటిక్స్లో వరంగల్ వాసి దీప్తి మెరిసింది. జపాన్లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్లో వరంగల్లో కల్లేడకు చెందిన దీప్తి జీవాన్జీ గోల్డ్ మెడల్ సాధించింది. టీ20 కేటగిరీలో మహిళల విభాగంలో 400 మీటర్ల రేస్ని 55.07 సెంటర్లలో చేధించింది. ఒకప్పుడు శిక్షణ పొందేందుకు కనీసం బస్సు టికెట్ కూడా కొనలేని స్థితిలో దీప్తి.. నేడు ప్రపంచ రికార్డు సాధించడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.