మహారాష్ట్రలో అకోలా జిల్లాలోని అస్సాంకు చెందిన 26 ఏళ్ల మహిళా టాటూయిస్ట్ తలకు గాయాలై మృతి చెందింది. ప్రియుడే ఆమెను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో పరిచయమైన ప్రియుడు ఈ ఘటనకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడని, పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాధిత మహిళను శాంతిక్రియా కశ్యప్ అలియాస్ కోయెల్గా గుర్తించారు.