హైదరాబాద్లో సైబర్ నేరగాళ్లకు సిమ్ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూర్చిన ముగ్గురు సభ్యుల ముఠాను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు అరెస్ట్ చేశారు. పలువురి పేర్లతో సిమ్ కార్డులు తీసుకుని ఈ ముఠా దుబాయ్కి పంపిస్తోంది. నిందితులు దుబాయ్, థాయిలాండ్, కాంబోడియాలో కాల్ సెంటర్లు నిర్వహిస్తూ నకిలీ సిమ్ కార్డులతో ఫోన్లు చేస్తూ భారతీయులకు ఎరవేస్తున్నారు. పలు కీలక సైబర్ నేరాల్లో వాట్సాప్ నంబర్లను వినియోగించారు.