జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ

62చూసినవారు
జమ్మూకాశ్మీర్‌లో పర్యటించనున్న ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 20, 21 తేదీల్లో కేంద్ర పాలిత ప్రాంతంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.1,500 కోట్ల విలువైన 84 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులను ఆయన ప్రారంభించనున్నారు. జూన్ 21న ఉదయం 6:30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించనున్నారు. తర్వాత యోగా సెషన్‌లో పాల్గొంటారు.

సంబంధిత పోస్ట్