వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అతడికి ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలని దాఖలైన పిటిషన్ను శుక్రవారం విచారణ జరిగింది. ఈ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. అలాగే అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డికి కూడా బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో అప్రూవల్గా మారిన దస్తగిరి ఈ పిటిషన్ను దాఖలు చేశాడు.