'మైత్రి ఎక్సర్‌సైజ్‌-2024' పేరిట ఏ దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించారు?

54చూసినవారు
'మైత్రి ఎక్సర్‌సైజ్‌-2024' పేరిట ఏ దేశాల మధ్య సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించారు?
2024, జులై 1 నుంచి 15 వరకు భారత్, థాయ్‌లాండ్ దేశాల మధ్య 'మైత్రి ఎక్సర్‌సైజ్‌-2024' పేరిట సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించారు. థాయ్‌లాండ్ లోని టాక్ ప్రావిన్స్ లో ఉన్న వచిర ప్రకాన్ వద్ద ఇండియన్ ఆర్మీ, రాయల్ థాయ్ ఆర్మీలు ఈ సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయి. భారత్, థాయ్‌లాండ్ మధ్య సైనిక సహకారాన్ని పెంచడమే లక్ష్యంగా 2006 నుంచి 'మైత్రి ఎక్సర్‌సైజ్‌' పేరిట సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్