రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి

78807చూసినవారు
రోడ్డు ప్రమాదంలో బీఆర్ఎస్ నేత మృతి
నల్లగొండ జిల్లా కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదం బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదాన్ని నింపింది. అద్దంకి -నార్కట్‌పల్లి హైవేపై జరిగిన యాక్సిడెంట్‌లో బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి సాధినేని జనార్ధన్ రావు(48) మృతి చెందాడు. బైక్‌పై టౌన్‌లోకి వస్తున్న ఆయనను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో జనార్ధన్ ఎగిరి పడటంతో తలకు బలమైన గాయాలై స్పాట్‌లో ప్రాణాలు విడిచారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్