మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు కీలక నిర్ణయం తీసుకుంది. జైల్లో ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి వీలుగా స్మార్ట్ కార్డులను జారీ చేసింది. ఛత్రపతి శంభాంజీనగర్లోని సెంట్రల్ జైలులో దాదాపు 650 మంది ఖైదీలకు వారి కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను పంపిణీ చేసినట్లు ఓ జైలు అధికారి పేర్కొన్నారు. వీటి ద్వారా ఖైదీలు వారానికి మూడుసార్లు, ఆరు నిమిషాల పాటు తమ వారితో మాట్లాడే అవకాశం ఉంటుంది.